ఈ భూమి మీద ప్రత్యేకమైన మహిళవు నీవు.. జాన్వీ ఇంట్రెస్టింగ్ పోస్ట్ వైరల్

by Disha Web Desk 6 |
ఈ భూమి మీద ప్రత్యేకమైన మహిళవు నీవు.. జాన్వీ ఇంట్రెస్టింగ్ పోస్ట్ వైరల్
X

దిశ, సినిమా: బాలీవుడ్ స్టార్ కిడ్ జాన్వీ కపూర్ తన తల్లి, దివంగత నటి శ్రీదేవిని తలచుకుంటూ మరోసారి ఎమోషనల్ అయింది. ఆదివారం శ్రీదేవి బర్త్ డే సందర్భంగా ఆమెకు గూగుల్ నివాళి అర్పించిన విషయం తెలసిందే. కాగా తన తల్లికి ఈ గౌరవం దక్కినందుకు ఆనందంగా ఉందన్న జాన్వీ నెట్టింట మరో పోస్ట్ షేర్ చేస్తూ.. ‘అమ్మా నీకు జన్మదిన శుభాకాంక్షలు. అమ్మమ్మ, నీవు కలిసి ఓ సినిమా సెట్స్‌లో దిగిన ఫొటో నీకు బాగా ఇష్టమైనదని మాకు తెలుసు. నేను కూడా ఈ రోజు అదే సెట్స్‌లో ఉన్నాను. ప్రతిరోజు నిన్ను ప్రేమిస్తూనే ఉంటానమ్మా. ఈ భూమి మీద ప్రత్యేకమైన మహిళవు నీవు. ఎప్పటికైనా నీవు మాతోనే ఉంటావ్. నీకు చాలా ఇష్టమైన ఐస్ క్రీమ్, పాయసం తింటావని ఆశిస్తున్నా. మా ఎదుగుదలకు కారణం నువ్వే అమ్మా. నీవు లేని లోటు ఎప్పటికీ తీరనిది’ అంటూ పలు జ్ఞాపకాలను గుర్తుచేసుకుంటూ భావోద్వేగానికి లోనైంది జాన్వీ.



Next Story

Most Viewed